Showing posts with label Usha's Column. Show all posts
Showing posts with label Usha's Column. Show all posts

27.3.09

ఆది ఆరంగేట్రం అదుర్స్

ఆది 'ఆరంగేట్రం అదుర్స్

మహాకూటమి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జూనియర్ ఎన్.టి.రామారావు కోస్తా ప్రజలను ఉర్రూతలూగిస్తున్నరు.తెలుగుదేశంపార్టీ వ్యవస్తాపకుదు నందమూరి తారక రామారావు పేరుతో పాటు పోలికలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్.కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల వేళ అందునా సినీనటుల సభలకు ప్రజలు రావడం సహజమే అయినప్పటికి జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ స్ఠాపించినప్పుడు ఎన్.టి.రామారావు చేసిన ప్రచారం తీరుగానే ఆయన మనమడు సాగుతున్నారు. తాను తాతగారిని అనుకరించడంలేదని జూనియర్ ఎన్.టి.ఆర్.చెబుతున్నా కాకిరంగు ప్యాంట్,అదే రంగు చొక్కా,మెడలో పసుపుపచ్చ రంగు కండువాతో ఆనాటి ఎన్.టి.ఆర్.ను గుర్తుకుతెస్తున్నారు.తాతగారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం నొంచే జూనియర్ రోడ్ షోను ప్రారంభించారు.

ఆపద్భాంథవులు నందమూరి హీరోలు

అథికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు బంధువులు ఎవ్వరిని దరికి చేరనివ్వని తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో నందమూరి హీరోలను రంగంలోకి దింపక తప్పలేదు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి భాగస్వామ్య పార్టీలతో సర్దుబటు,అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం భాథ్యతను నందమూరి హీరోలకు అప్పగించారు.ఇప్పటికీ చంద్రబాబు వియ్యంకుడు,హీరో అయిన బాలక్రిష్ణ రాయలసీమ,ప్రకాశం జిల్లాలలో పర్యటించగా,జూనియర్ ఎన్.టీఅర్.ఉత్తరాంథ్రాలో రోడ్ షో ప్రారంభించి కోస్తాంథ్రాలో ప్రచారం చేస్తున్నారు.బాలక్రిష్ణ రాజకీయ ప్రసంగాలు చేసి ఉండకపోవచ్చుగానీ,ప్రచారంలో పాల్గొన్న అనుభవం ఉన్నది.కాని జూనియర్ ఎన్.టి.ఆర్.కు రాజకీయాలు కొత్త, రాజకీయ ప్రసంగాలూ అంతకంటే కొత్త. ఎన్.టి.ఆర్ పోలికలను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రజాదరణ ఉండగలదన్న చంద్రబాబు వ్యూహం తప్పుకాలేదు.దీనికితోడు జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ప్రసంగం సరాంశం ఒక్కటే అయినప్పటికీ వైవిథ్యభరితంగా సాగుతన్న జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రసంగాలకు ప్రజలు హర్షథ్యానాలు చేస్తున్నారు. మాటలో స్పష్టత,తొందరపాటు,తొట్రుపాటు లేకుండా సాగుతున్న జూనియర్ ప్రసంగాలకు పార్టీ శ్రేణులే నివ్వెరపోతున్నయి.

తెలుగువారి ఆత్మగౌరవం,ఢిల్లీలో తెలుగు జాతి తాకట్టు, అక్కలారా,అన్నలారావంటి పద ప్రయోగాలు అలనాటి ఎన్.టి ఆర్ ను తలపిస్తున్నయి.127 సంవత్సరాల ముసలి కాంగ్రెస్ కావాలో,27 సంవత్సరాల నవ యవ్వన తెలుగుదేశం పార్టీ కావాలో తేల్చుకోవలసిందిగా జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రజలను కోరుతున్నారు.పదప్రయొగాలు,దానికి తగ్గ హావభావాలతో ఆయన ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు.

అంచనాల కంటే అనుమానాలే ఎక్కువ

వాస్తవానికి జూనియర్ ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రచారం ఆరంగేట్రం చేస్తారన్నప్పుడు అంచానాల కంటె అనుమానాలే ఎక్కువ.ఎందుకంతే ఎన్.టి.ఆర్ మినహా సినీరంగం నుంచి వచ్చిన నటులెవ్వరికి అంత వాగ్థాటి లేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంచేస్తున్న బాలక్రిష్ణ ఊపన్యాసాలలో అంతగా పసలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరంజీవి రాజకీయ ఉపన్యాసాలు పదునుగా లేవని,ఏదో బతిమాలుతున్న ధొరణిలో,మొహమాటంగా ఉంటున్నాయనే విమర్సలు వినిపిస్తున్నాయి. ఇంద్ర,ఠాగూర్ వంటి చిత్రాలతో పోలిస్తే చిరంజీవి రాజకీయ ప్రసంగాలు చప్పగా ఉన్నాయంటూ అభిమానులు నిరాశ చెందారు.

ఇక బాలక్రిష్ణ విషయానికి వస్తే రాసిచ్చిన్న ప్రసంగాలను కూడా సరిగ్గా చదవలేకపోతున్నారని, తడబడుతూ మాటలు వెతుక్కుంటున్నట్లుగా ప్రసంగాలు సాగుతున్నాయనే విమర్సలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రచారానికి వస్తున్నరంటే ఎన్.టి.ఆర్ మనుమడు,అందరికి తెలిసిన "ఆది",స్టూడెంట్ నెంబర్ -1 ను కనులారా చూడవచ్చని భావించారు.అయితే,అందరి అంచనాలను తలక్రిందులుగా చేస్తూ జూనియర్ ఎన్.టి.ఆర్ దూసుకుపోతున్నారు.ఒక ప్రక్క పాలక కాంగ్రెస్ ను దుయ్యబడుతూనే మరో ప్రక్క 'దేశం' పార్టీ పథకాలను ప్రచారం చేస్తున్నారు.ముసలి కాంగ్రెస్ కావాలో,నవ యవ్వన తెలుగుదేశం కావాలో జూనియర్ హాహభావాలతో చేస్తున్న ప్రసంగాలకి ప్రజలు కేరింతాలు కొడుతున్నారు.తమ పార్టీ చెప్పదలచిన పథకాలను సవివరంగా చెబుతూ పేదలకు అండగా నిలిచేది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయేనని ఆయన ప్రజలకు వినిపిస్తున్నారు.

ముందుగా రిహార్సల్

జూనియర్ ఎన్.టి.ఆర్ రోడ్ షో లు విజయవంతం కావడం వెనుక ఎంతో హోం వర్క్ ఉన్నట్లు తెలుస్తున్నది.ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జూనియర్ ఎన్.టి.ఆర్ ఎంతో 'సాథన 'చేశారని ఒక దిన పత్రికలో వార్తాకథనం. జూనియర్ ఎన్.టి.ఆర్ స్వశక్తితో పైకి వచ్చున వ్యక్తి.నిజజీవితంలోకానీ,సినీ జీవితంలోకానీ ఏటికిఎదురీది ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇంతటి స్థాయికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని, ఒరిజినాలిటిని పెంచాయని చెబుతుంటారు.

అసలు రాజకీయ ప్రసంగాలు ఎలా చేయాలి? హావభావాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై జూనియర్ ఎన్.టి.ఆర్ ఎంతో అథ్యయనం చేశారని తెలుస్తోంది.ఏఏ అంశాలను ప్రస్తావించాలి, ఎలా ప్రస్తావించాలి అనే దానిపై క్రమపథ్థతిలో విషయ సేకరణ చేసుకున్నారట.అలాగే,తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్.టి.రామారవు చేసిన ప్రసంగాల వీడియో సిడీ లను తెప్పించుకుని హావభావాలను నిశితంగా గమనించారట. ఎన్.టి.రామారావు చేపట్టిన పథకాలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మేనిఫిస్తోలో చేర్చిన అంశాలను పూర్తిగా తెలుసుకున్నారట.పాలక కాంగ్రెస్ కేంద్రంలోను,రాష్ట్రంలోను చేపట్టిన పథకాలను,అందులోని లోటుపాట్లను పలువురితో చర్చించి అవగహన పెంచుకున్నారట.

తెరవెనుక ఇంతటి శ్రమ ఉండబట్టే ఎన్.టి.ఆర్ సభలకు ఇంతటి క్రేజ్ వచ్చింది. జూనియర్ ఎంటి.ఆర్ సభలకు వస్తున్న స్పందన చంద్రబాబునాయడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ప్రచారం ఇలాగే కొనసాగించు అంటూ మేనల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు.

వి.ఉషారాణి.

19.2.09

ఆంధ్ర రాజకీయాల సింహావలోకనం


సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమౌతున్నది.ఎన్నికల కమీషనర్లలో ఒకరయిన శ్రీ ఖురెషి లండన్ లో చేసిన వ్యాఖ్య రాజకీయ పార్టీలకు ఎన్నికల సంకేతాలను ఇచ్చాయి.లొక్ సభ ఎన్నికలు ఏప్రిల్ ఎనిమిది నుంచి మే 15వ తేదీ మధ్య ఉండవచ్చు అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత కలకలం స్రుష్టించినప్పటికీ షెడ్యులు ప్రకారం అటూ ఇటూ గా ఆ సమయములోనే ఎన్నికలు జరగవలసి ఉన్నది.


వంద రోజులలో ఎన్నికలు అంటూ ఇప్పటికే రాజకీయ పార్తీలు కౌంట్ డౌన్ ప్రారంభించాయి. వాస్తవానికి ఆంధ్రప్రధేశ్ లో ఆరు నెలల క్రితమే ఎన్నికల సందడి ప్రారంభం అయింది.

సినీరంగంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయలలో కలకలం స్రుష్టించింది.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక వర్గం,తెలుగుదేశం పార్టీలో మరొక సామాజిక వర్గం పెత్తనం చెలాయిస్తున్నప్పటికీ బయటకు గట్టిగా అనుకునే పరిస్ఠితి లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన మరొక సామాజిక వర్గం ప్రధాన రాజకీయ పార్టీలు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదనే అసంత్రుప్తిలో ఉండేది. ఇదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతొ ఈ వర్గానికి కొత్త శక్తి వచ్చినట్లు అయింది.

ఎప్పుడు అయితే చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించారో అప్పటి నుంచే రాష్ట్రంలొ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పవచ్చు.ఎన్ని కొత్త పార్తీలు వచ్చినా తమ ఓటు బ్యాంక్ కు వచ్చే నష్టం ఏమి లేదనే కాంగ్రెస్,తెలుగదేశం పార్టీలు ఎంతగా బింకాలు పలికినా ప్రజారాజ్యం పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండగలదని బేరీజు వేయడం ప్రారంభించాయి.దీనికి తోడు ప్రజారాజ్యం తిరుపతి సభ విజయవంతం కావడం రెండు పార్టీలకు కంగారు పుట్టించింది.దీనితో తమ సత్తా నిరోపించుకొవడానికి పోటాపోటీగా రోడ్ షొ లు ప్రారంభించాయి.దీనితో ఆరు నెలల ముందే ఎన్నికల 'కళ ' వచ్చినట్లు అయింది.

//ఎత్తులకు పై ఎత్తులు//


అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీని గద్దె దింపాలని విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు ప్రారంభించాయి.తాము చేపట్టిన అభివ్రుధి సంక్షేమ పధకాలే తమకు శ్రీరామరక్ష అని,తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తెలుగుదెసం పార్తీ అథ్యక్షుడు చంద్రబాబునాయుదు నెమ్మదిగా పావులు కదపటం ప్రారంభించారు.కేంద్రంలొ కాంగ్రెస్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసిం హరించినప్పటి నుంచి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.తెలుగుదేశం పార్టీ వైపు సి.పి.ఎం. మొదటి నుంచి మొగ్గు చూపగా,సి.పి.ఐ.కొంతకాలం ప్రజారాజ్యం పార్టీ వైపు చూపులు సారించినా చివరికి బాబు ప్రతిపాదనలకు అంగీకరించి మహాకూటమి వైపు అడుగులు వేసింది.ప్రత్యేక తెలంగాణకు జై కొట్టడ్డాం ద్వారా నెమ్మదిగా తెలంగాణా రాష్త్ర సమితిని తమ కూటమిలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.ఎట్టకేలకు 2004లో రాజశెఖర్ రెడ్డి కి మాదిరిగా విపక్షాలను ఒకత్రాటిపైకి తీసుకుని రావడంలొ చంద్రబాబు సఫలీక్రుతులు అయ్యారు.మహాకూటమి ఆవిర్భవించింది.ప్రత్యేక తెలంగాణా ధ్యేయంగా సినీనటి విజయశాంతి ఆధ్వర్యంలొ ఏర్పడిన తల్లి తెలంగాణ పార్టీ తెలంగణా రాష్త్ర సమితిలో విలీనం అయ్యింది.

తెలంగాణా వాదులలొ నవ తెలంగాణ పార్టీని స్థాపించిన దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణాకు సై అన్న చిరంజీవి పార్టీతొ రాజకీయ అవగాహనకు వచ్చారు. అభివ్రుధి మంత్రంతో కాంగ్రెస్ పార్టీ ఎవరూ పొత్తుకు ముందుకు ర్రకపోవడంతొ భారతీయ జనతా పార్తీ ఒంటరిగా పోటీ చేయబోతున్నాయి.

// రోడ్ షో లకు పెరిగిన ఆదరణ //

ఎన్నికల ప్రచారంలొ రోడ్ షో లకు ఆదరణ పెరిగింది.ఎన్.టి.ఆర్. రాజకీయలలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారములలొ మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.అంతకు ముందు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు,ఇంటింటికి ప్రచారం,అభ్యర్ధులకు మద్దత్తుగా ర్యాలీలు ఉండేవి. ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రచార ధోరణిలొ మార్పు వచ్చింది.ఒక్కసారిగా సినీరంగం నుంచి వచ్చిన ఎన్.టి.ఆర్.తమ పార్టీని ప్రజలలోనికి తీసుకురావడానికి ఊరూరా తిరిగారు.రాత్రనక పగలనక శ్రమించేవారు. ఆనాటి ఎన్.టి.ఆర్. ప్రచార రధమే నేటి రాజకీయపార్టీల రోడ్ షోలుగా చెప్పవచ్చు.రోడ్ షోలవల్ల వ్యయప్రయాసలు తక్కువ హంగూ,ఆర్భాటాలు అవసరము ఉండదు.జనసమీకరణ ప్రశ్నే ఉండదు.అందుకే అన్ని రాజకీయ పార్టీలు రోడ్ షో లకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు.

// ప్రచారంలొ వింత ధోరణులు //

ఈసారి ఎన్నికల ప్రచారంలొ వింత ధొరణులు కనిపిస్తున్నయి.సినీనటుడైన చిరంజీవిని ఎదుర్కోనెందుకు కాంగ్రెస్,తెలుగుదేసం పార్తీలు సినీనటులను రంగంలోకి దింపాయి.ఇంతకు ముందెన్నదూ లేనంతగా సినీనటులు ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరు తొడకొట్టి,మరొకరు చొక్కావిప్పి సవ్వల్చేస్తుంతే,ఇంకొకరు మీసం మెలివేసి చాలెంజ్ చేస్తున్నరు.సినీనటులకు తామేమి తీసిపోమంటూ ముఖ్య్యమంత్రి గాలిలోకి ముద్దులు ఇస్తూ ప్రజలను మురిపిస్తున్నారు. ఓటర్లు రాబోయే ఎన్నికలలో తొడగొట్టిన చిరంజీవిని గెలిపిస్తారో,మీసం మెలివేసి మరీ తెలుగుదేసం పార్టీని గట్టెకిస్తానన్న బాలయ్య ప్రతిజ్ఞ్న నెరవేరుస్తారో,ముఖ్యమంత్రి ప్రేమతో గాలిలోకి ఇచ్చిన ముద్దులకు మురిసిపోయి తిరిగి కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెడుతారో చూడాలి మరి!

/ వి.ఉషారాణి. /

24.12.08

Usha's Column: Win love with love


The writer is an ex-journo with a leading Telugu Newspaper and is currently based in Vijayawada. Every week, she would be reflecting on news and happenings,exlusive to ohmyroots.

26.11.08

Usha's Column: Star wars in andhra politics


The writer is an ex-journo with a leading Telugu newspaper and is currently based in Vijayawada. She would be reflecting on news and happenings exclusive to ohmyroots

17.11.08

Usha's Column: Good response for Chiru in Telangana

The writer is an ex-journo with a leading Telugu newspaper and is currently based in Vijayawada. Every week,she would be reflecting on news and happenings,exclusive to ohmyroots.

7.11.08

Usha's Column: Yuva Garjana Successful

The writer is an ex-journo with a leading Telugu newspaper and is currently based in Vijayawada. Every week,she would be reflecting on news and happenings exclusive to ohmyroots

24.10.08

Usha's Column: Chiru fears in Congress and TDP


The writer is an ex-journo with a leading Telugu newspaper and is currently based in Vijayawada. Every Week, she would be reflecting on news and happenings exclusive to ohmyroots.

8.10.08

Usha's Column: Megastar's tour


Usha is an ex-journo with a leading Telugu newspaper and is currently based in Vijayawada. Every week, she would be reflecting on news and happenings, exclusive to ohmyroots.

4.10.08

Usha's Column: Telecast of Crime Programmes


Usha is an ex-journo with a leading Telugu Newspaper and is currently based in Vijayawada. Every week, she would reflecting on news and happenings, exclusive to ohmyroots.

17.9.08

Usha's Column: Stars dazzle in Andhra Politics




Usha is an ex journo with a leading Telugu Newspaper and is currently based in Vijayawada. Every Week she would be reflecting on news and happenings, exclusive to ohmyroots.

10.9.08

Usha's Column: Mega star on the political screen


Usha, daughter of foremost Telugu Journalist K S Subrahmanyam, is an ex-journo with a leading Telugu Newspaper. Starting this week, she would be reflecting on the news and happenings, right from the heart of Andhra Pradesh, Vijayawada.