5.8.09

రాజకీయ సుడిగిండంలో మహిళా రిజ్జర్వేషన్ బిల్లు

మహిళాభ్యుదయం,మహిళాస్వేఛ గురించి ఉపన్యాసాలు దంచే 'మగా'నుభావులు ఈపవిత్ర భారత దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. కాని మహిళలకు చట్టసభలలో 33శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం 13సంవత్షరాలుగా అతీగతీలేకుండా మూలనపడి ఉంది.స్త్రీ స్వేఛను వ్యతిరేకించే చంధస వాదులు, భారతీయ సంస్క్రుతిని అమితంగా ఆరాధించే సంప్రదాయ వాదులు ఈబిల్లుకు గ్రహణం పట్టడానికి కారకులుకాదు. ఎందువల్లనంటే ప్రాచీనభారతీయ సప్రదాయం స్త్రీ స్వేఛకు వ్యతిరేకంకాదు.వేద విద్యల్,యుద్ధవిద్యలలో ఆరితేరిన మహిళామణులు ప్రాచీన భారత దేశంలో ఉండేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. రాజకీయ మంత్రాంగంలో సైతం ఆనాటి మహిళలు పాలు పంచుకొనేవారు.

వేదమంత్రాలలో భాగస్వాములైన మహిళలు దాదాపు 20మంది మంత్రదష్టలైన మహిళలను ౠషీకలుగా పిలిచేవారు.మైత్రేయి,అపాల,ఘోష వంటి ౠషీకలకు అలనాటి సమాజంలో సముచిత రీతిలో గౌరవించేది కాని అవమానించలేదు.బాల్యవివాహాలు,సతీసహగమనం వంటి దురాచారాలు,విదేశీ దాడులు,పరిపాలన వల్ల భారతీయ సమాజంలో అంకురించిన దుస్టసంప్రదాయాలు.అంతేగాని ప్రాచీన భారతీయ సంస్క్రుతికి సంకేతాలు కాదు. వేదకాలం నుండి స్త్రీలను గౌరవించిన ఈదేశంలో మహిళాబిల్లు అటకకెక్కడం శోచనీయం.

మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్ల్కు 13ఏళ్ళు నిండాయి కాని బాలారిష్టాల నుంచి మాత్రం ఈబిల్లు గట్టెక్కలేదు. ఈబిల్లును 1996,1998 మరియు 1999 సంవత్షరాలలో లొక్ సభలో ప్రవేశపెట్టారు. 2008లో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకోసం పంపించారు.కాని ఈనలుగుసార్లు ఏకాభిప్రాయం కుదరక బిల్లు అమోదానికి నోచుకోలేదు. ఈసంవత్షరం జరిగిన ఎన్నికలలో తిరిగి అధికారం చేపట్టిన యు.పి.ఎ ప్రభుత్వం ఈబిల్లుకు బూజుదులపాలని సంకల్పించింది. దీనితో బిల్లుపై మళ్ళీ వివాదానికి తెరలేచింది.కొన్ని వర్గాలు దీనిని త్రీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈబిల్లువల్ల కొందరు చట్టసభలలో ప్రవేశించే అవకాశం కోల్పోతారని లల్లుప్రసాద్, మూలాయంసింగ్ యాదవ్,శరద్ యాదవ్ వంటి ప్రముఖనాయకులు వాదిస్తున్నారు. ఈబిల్లును త్రీవ్రంగా వ్యతిరేకించనన్నుట్టు కూడా వారు తెలిపారు.కేవాల్మ్ ఒక వర్గం మాత్రమే దీనిని వ్యతిరేకించడం గమనార్హం.ప్రస్తుతం చట్టసభలలో రిజర్వేషన్ కూటా పొందుతున్న ఎస్.సి,ఎస్.టి,బి.సి లకు మహిళారిజర్వేషన్ బిల్లువల్ల ఏవిధమైన నష్టం ఉండదు. ఈవర్గాలకు రిజర్వేషన్ అయిన స్ధానాలను మహిళలకు కేటాయించవలసివస్తే అక్కడా ఆయా వర్గాలకు చెందిన మహిళలను పోటీకి నిలబెట్టవచ్చు. కనుక ఆయావర్గాల హక్కులకు ఎటువంటి ప్రమాదంలేదు. ప్రస్తుతం ఒబిసి లకు చట్టసభలలో రిజర్వేషన్ లేదని, ఈబిల్లు వల్ల వారికి నష్టం జరుగుతుందని కొందరి వాదన. కాని ఒబిసి లకు రిజర్వేషన్ లేదనే వంకతో మహిళల హక్కులకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసం? తమ హక్కులకోసం పోరాడటానికి బదులు ఇతరుల హక్కులను ఆటంకపరచడానుకి ప్రయత్నించడం న్యాయం కాదు. కనుక తమకు న్యాయం జరపాలని ఒబిసిలు ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలి. అంతేకాని ఈబిల్లును ఆతంకపరిచి 'మహిళావ్యతిరేకు ' లని ముద్రవేయించుకోవడం సబబుకాదు.

ఈసందర్భంలో మూలాయంసింగ్ యాదవ్ చేసిన ఒక సూచననుకూడా పరిశీలించడం అవసరం.ఆయా పార్టీలు అంతర్గతంగా 20శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని అలాచేయని పార్టీలకు గుర్తింపు రద్దు చేయాలని ఆయనకోరారు.చట్టసభలలో మహిళల పాత్ర 20శాతానికి పరిమితమ్మైపోతుంది. అంతేగాక పార్టీపరమైన రిజర్వేషన్ లలో అన్నిపార్టీలు ఒకేతాటిపై నడవాలన్న నియమంలేదు. అటువంటి పరిస్ధితిలో మహిళలకు న్యాయంకంటే అన్యాయమే ఎక్కువగా జరుగవచ్చు. ఉదాహరణకు ఒక పార్టీ కాకినాడలోను,మరొక పార్టీ రాజమండ్రి లోను అభ్యర్ధులను నిలబెట్టవచ్చు.పొరపాటున ఈరండు చోట్ల మహిళలు ఓడిపోతే మొదటికే మోసంవస్తుంది. కనుక పార్టీ పరంగా గాక ప్రభుత్వపరంగానే మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలుచేయడం ఉత్తమం. కనుక ఈబిల్లుపై అన్ని వర్గాలవారు ఒక అంగీకానికి వచ్చి అందరికి న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నిచాలి.అంతేతప్ప మహిళారిజర్వేషన్ బిల్లును రాజకీయ సుడిగుండంలో పడవేయకూడదు. ఈవిషయంపై అన్నిపార్టీలు,అన్ని వర్గాలు నిష్పాక్షికంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి.

ఎం.వి.రమేష్

No comments: