12.6.09

ఆత్మవిమర్స చేసుకొనేవిధానం ఇదేనా?

ఓడిపోయిన పార్టీలు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడం ఎంతైనా అవసరం. ఫలితాల విశ్లేషణ ద్వారా ఆయా పార్టీలు ఆత్మవిమర్స చేసుకొని,తమ తప్పులను సరిదిద్దుకుని భవిష్యత్తులో విజయానికి రాచబాట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిపిన ఎన్నికల విశ్లేషణలో ఆత్మవిమర్సను పూర్తిగా విస్మరించింది.పైగా ఆత్మస్తితి,పరనింద ప్రధాన లక్ష్యాలుగా ఎన్నికల ఫలితాలపై తెలుగు దేశం పార్టీ వ్యాఖ్యానాలు చేయడం విడ్డూరం. కొత్తగా వచ్చిన లొక్ సత్తా,ప్రజారాజ్యం పార్టీలు ఓట్లను చీల్చడం వల్లనే తాము ఓడిపోయామని, ఆపార్టీలు లేకపోతే తాము గెలిచి ఉండేవారమని తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడు సెలవిచ్చాలు.తమ పార్టీ జయాపజయాలను పార్టీలు నిర్దేశిస్తాయనుకుంటే అంతకంటే అఙ్ఞానం మరొకటిలేదు. ప్రజాదరణ ఒక్కటే ఏపార్టీకైనా శ్రీరామరక్ష. ప్రజల అభిమానం పొందగలిగిన పార్టీలను రాజకీయశక్తులు ఏమీచేయలేవు. కొత్తగా వచ్చిన రాజకీయపార్టీలు తెలుగుదేశంపార్టీ ఓట్లను మాత్రమే ఎందుకు చీల్చాయి? కాంగ్రెసు ఓట్లను ఎందుకు చీల్చలేదు? అనే ప్రశ్నకు చంద్రబాబునాయుడుగారు జవాబు చెప్పలేదు. 2004 సంవత్సరం నాటి ఎన్నికలలో కాంగ్రెసు 38.56 శాతం, తెలుగుదేశం పార్టీకి 37.59 శాతం ఓట్లు లభించాయి. కాగా 2009 నాటి ఎన్నికలలో కాంగ్రెసు కి 36.56 శాతం,టిడిపి కి 28.12 శాతం లభించాయి.అంటే గతేన్నికలలో కంటే ఈఎన్నికలలో తెలుగుదేశంపార్టీకి ఓట్లశాతం గణనీయంగా తగ్గింది.ఈవిషయంలో కాంగ్రెసు పరిస్థితి టిడిపికన్నా మెరుగ్గా ఉంది. అంటే కొత్తపార్టీలు టిడిపి విజయావకాశాలను దెబ్బతీశాయి. కాని కాంగ్రెసు ఫలితాలపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. తెలుగుదేశంపార్టీ గతంలోకంటే ప్రజాదరణను కోల్పోయిందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

కొత్తపార్టీలు ఆవిర్భవించడమే తప్పు అనేధోరణిలో చంద్రబాబునాయడుగారు మట్లాడుటం మరొక విచిత్రం. ప్రజాసౌమ్య వ్యవస్తలో కొత్తపార్టీలను స్ట్ధాపించుకొనే హక్కు ఎవరికైనాఉంది.కనుక ఫలానాపార్టీలు లేకపోతే తమకు విజయం వరించి ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యనించడం ప్రజాసౌమ్య విరుధం.ప్రజాదరణ కోల్పోవడం వల్ల తాము ఓడిపోయామని గ్రహించకుండా తమ పరాజయానికి కొత్త పార్టీలు ఆవిర్భావం, ఇవియం ల వినియోగం కారణమని చంద్రబాబు పేర్కొనడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ఇటువంటి ఆలోచనాధోరణై పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తుందే తప్ప విజయపథం వైపుకు నడిపించడానికి దోహదం చేయదు.సమ్యమనం కోల్పోయి ఇటువంటి అసంగతమైన వ్యాఖ్యాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయిన చంద్రబాబునాయుడుకి ఎంతమాత్రము తగదు. అసలు తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించకపోతే రాష్ట్రంలో తమపార్టీకి ఎదురేఉందేది కాదని కాంగ్రెస్స్ నాయకులు వాదిస్తే ఎలాఉంటుందో ఒక్కసారి ఆలొచిస్తే బాబుగారి కి తెలుస్తుంది. అయితే మరొక్కవిషయం ఈసందర్భంలో తప్పనిసరిగా ఆలోఅచించాలి.మైనారిటీ ఓట్లలో(36.56 శాతం)కాంగ్రెస్స్ అధికారాన్ని చేపట్టిందనే విమర్శసత్యదూరం కాదు. కాంగ్రెస్స్ కు 36.56శాతం ఓట్లు మాత్రమె వచ్చాయంటే 63.44 శాతం మంది ఆపార్టీని వ్యతిరేకించారని అర్ధం. సమర్ధించిన వారికంటే వ్యతిరేకించిన వారు అధికారం కట్టబెట్టుడం సమంజసమా అనే వాదనలు విస్త్రుతంగా వినిపిస్తున్నాయి. ఈరకంగా ఆలోచిస్తే చాలాకాలంగా మనదేశంలో రాజకీయపార్టీలు అధికారం చేపడ్డానికి అర్హతను సాధించలేపోతున్నాయి అని చెప్పవలివస్తుంది. ఉదాహరణకు తెలుగు దేశంపార్టీ 28.12 శాతం ఓట్లు అనికూలంగా వచ్చాయి.71.38 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.అటువంటి పార్టీకి కాంగ్రెస్స్ అర్హతను ప్రశ్నించే హక్కు ఉంటుందా? కనుక ఓట్లశాతాన్ని బట్టిగాక సీట్ల శాతం (సంఖ్యకు) బట్టి అధికార అర్హతను నిర్ణయించడం జరుగుతోంది.

అయితే మనదేశంలో మైనారిటి ఓట్లు వచ్చిన పార్టీలు అధికారాన్ని ఎలా చేపట్టగలగుతున్నాయి అనేప్రశ్నను నిర్లక్ష్యం చేయకూడదు. మనరాష్ట్రంలో అధికార పార్టీకి 36.56, తెలుగుదేశం పార్టీకి 28.12 మిగిలిన అన్ని పార్టీలకు కలిపి 35.32 శాతం ఓట్లు లభించాయి.2004నాటి ఎన్నికలలో కాంగ్రెసు కు 38.56,తెలుగుదేశంకి 37.59 ఇతర పార్టీలకు 23.85 శాతం ఓట్లు లభించాయి.2004 లో కంటే ఈసారి అధికార,ప్రతిపక్షపార్టీలకు ఓట్లు శాఅతం తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది.మరోరకంగా చెప్పాలంటే ఈరెండుపార్టీలకు గతంలోకంటే ఇప్పుడు ప్రజాదరణ తగ్గింది.కొత్తపార్టీల వల్ల తమకు ప్రజాదరణ తగ్గింది అనడం హాస్యాస్పదం.మరొకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ప్రధానపార్టీలు ప్రజాదరణ కోల్పోవడం వల్లనే మైనారిటీఓట్లు వచ్చినపార్టీలు గద్దెనెక్కడం అనేవైపరీత్యం సంభవించిందన్నమాట. అలాగాక అధికారపార్టీ 60శాతం ఓట్లు సాధించగలిగిటే మిగిలినపార్టీలు 40శాతం ఓట్లను పంచుకోవలసివచ్చేది.అప్పుడు మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే అధికారపీఠం దక్కిఉందేది. కాని అంతటి ప్రజాదరణ పొందగలిగే స్ఠాయికి మన పార్టీలు ఎదగలేదనేది స్పస్ఠం. ఆస్ఠాయికి ఎదగడానికి ఇప్పటికైనా మనపార్టీలు ప్రయత్నిస్తే మైనారిటీ ఓట్లతో అధికారాం చేపట్టారనే నింద పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పొందడానికి బహుపార్టీ వ్యవస్ఠ అడ్డురాదు.

బహుపార్టీ వ్యవస్థతో గందరగోళం

అయితే ఒకపార్టీ వ్యవస్థ దేశంలో గందరగోళాన్ని, అస్తవ్యస్తాన్ని స్రుష్థిస్తోందన్న వాదనలో కొంతనిజం లేకపోలేదు.కాని కొత్తపార్టీల ఏర్పాటును ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికిలేదనడం నిర్వివాదాంశం.కాని రాజకీయ పార్టీల పనితీరును క్రమబధ్ధం చేయడానికి, కొన్ని నియమాలను రూపొందిచడానికి,అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుర్తింపుకోరే కొత్త రాజకీయపార్టీలు ఆర్ధిక,పారిశ్రామిక,వ్యవసాయిక మరియు విద్యా తదితర రంగాలపై స్పష్టమైన విధానాలు రూపొందించి ఎన్నికల కమీషనరుకు లేదా ప్రభుత్వానికి సర్పించాలనే నిభంధన విధించాలి.దేశ సమగ్రతకు,సమైకానికి, స్వాతంత్రానికి,సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యా వ్యవస్థకు భంగం కలింగించని రీతిలో ఈవిధానాలు ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే భారతరాజ్యాంగానికి లోబడి ఈవిధానాలు ఉండాలి.ఇటువంటి విధానాలను అందించే పార్టీకి మాత్రమే ఎన్నికలలో గుర్తింపు ఇవ్వాలి. భవిష్యత్తులో ఈనిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపును రద్దు చేసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉండాలి.ఇలాంటి నిభంధనలు విధిస్తే రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ,భాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మనదేశంలో మేధావులంతా ఈదిశగా ఆలోచనలు సాగించడం అవసరం.అయితే పార్టీ సిధ్ధాంతాలు ఐదేళ్ళకొకసారి మారిపోకోడదు.ఈ సిధ్ధాంతాలకుగుణంగా ఎన్నికిల ప్రణాలికలో కొత్తకొత్త ప్రణాలికలను రూపొందించుకోవచ్చు.ప్రజాకర్షక పధకాలు దేశాభివ్రుధ్ధికి దోహదంచేయవనే విషయాన్ని కూడా మరిచిపోకూడదు. అధికారం లేకపోయినా ప్రజాసేవ చేయడానికి ఏవిధమైన అభ్యంతరం లేదనే అంశాన్ని రాజకీయపార్టీలు సర్వదా గుర్తుంచుకోవాలి.

ఐదేళ్ళ తర్వాత తమ పార్టీ మళ్ళీవిజయాన్ని సాధించి రికార్దు స్రుస్థించిందని కాంగ్రెసు వాదులు చేసుకొంటున్న ప్రచారాన్ని కూడా ఒక్కసారి పరిశీలించడం అవసరం. ఐదేళ్ళ పదవీకాలాన్ని పూర్తిచేసిన తర్వాత మళ్ళీ అధికారాన్ని చేపట్టిన తొలి ముఖ్యమంత్రిగా డా.రాజశేఖర్ రెడ్డి చెరిత్ర స్రుస్థినచారని కాంగ్రెసు వాదులు గొప్పగా చెప్పుకొంటున్నారు.నిజానికి ఇది గర్వకారణం కాదు.ఎందువల్లనంటే ఆంధ్రరాష్ట్ర ఏర్పడిన తర్వాత 53ఏళ్ళ వరకు కాంగ్రెసు ముఖ్యమంత్రి ఎవరూ ఐదేళ్ళ పదవీకాలాన్నీ పూర్తి చేయలేదంటే అది ఆపార్టీకి సిగ్గు చేటుకాదా. ఐదేళ్ళ కాలంలో ముగ్గురు లేదా నలుగురు ముఖ్యమంత్రులను మారిచిన ఘనచరిత్ర కూడా కాంగ్రెసుకు ఉంది.దానినే దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కాంగ్రెసు సంస్క్రుతిగా పేరుకొన్నేవరు. అటువంటి సంస్క్రుతి నుండి బయటపడటమే కాంగ్రెసు చరిత్రలో నిజంగా గొప్పవిషయంగా చెప్పుకోవాలి.రాష్ట్రాన్ని 37ఏళ్ళు కాంగ్రెసు,16ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించగా తెలుగుదేశంపార్టీకి చెందిన చంద్రబాబునాయుడు ఎక్కువకాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు స్థాపించడం మరొకవిచిత్రం.

53ఏళ్ళ తర్వాత ఒకకాంగ్రెసు ముఖ్యమంత్రి రికార్డ్ సాధించడానికి కారణాలు విశ్లేషించాలి. వై.ఎస్.ఐదేళ్ళ పాలనలో రాష్ట్రకాంగ్రెసులో అసంత్రుప్తి అధికంగా లేకపోవడం, చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలు సంత్రుప్తి ప్రకటించడం ఆపార్టీ విజయాలుగా చెప్పుకోవచ్చు. శ్రీ రాజశేఖరరెడ్డికి రెండవసారి అధికారం లభించడానికి ఇదికూడా ఒకకారణం కావచ్చు. కాంగ్రెస్స్ విజయానికి ప్రతిపక్షాలు వైఫల్యం కూడా ఒకకారణం.విపక్షంగా కొనసాగిన ఐదేళ్ళలో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందదంలో తెలుగుదేశంపార్టీ విఫలమయింది.కేవలం ఒకటి,రెండు నినాదాలను వల్లెవేయడం పైనే ద్రుష్టిని కేంద్రీకరించిన ప్రజారాజ్యంపార్టీ ప్రజభిమానాన్ని చూరగొనలేకపోయింది. కేవలం ప్రత్యేకతెలంగాణా ఒక్కటే లక్ష్యంగా పోటీచేసిన టి.ఆర్.ఎస్. విధానాన్ని ప్రజలు హర్షించలేదు.ఈవిషయాలు ద్రుష్టిలో ఉంచుకొని ఇటు ప్రతిపక్షాలు,అటు కాంగ్రెస్స్ తమ భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలి.

ఇకకేంద్రంలో మన్మోహన్ సింగ్ సాధించిన విజయానికి ప్రతిపక్షాల వైఫల్యము,అనైక్యత ప్రధానకారణాలు.ఏదిఏమైనా ప్రజాసంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ముందుకుసాగే పార్టీలకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఎం.వి.రమేష్

No comments: